ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయిన గాయని పీ సుశీల
20-08-2024 01:47 PM
చెన్నై: ప్రముఖ గాయకురాలు పీ సుశీల తాజాగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్లు గా ఓ వీడియో షేర్ చేశారు. సుశీలమ్మ కు కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరారు.తాను క్షేమంగా ఉన్నానని అబిమానుల ప్రార్థనల వల్లే తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని చెప్పుకొచ్చారు. బయట సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ను నమ్మ వద్దని ఆమె అభిమానులను కోరారు. ఈ వీడియేలో తమిళం, తెలుగు కలిపి మాట్లాడిన మాటలు నెటిజనులను ఆకట్టుకుంటున్నాయి.






