16-10-2025 06:41:03 PM
రైతులు సన్నగుడ్లకు బోనస్ ను ఉపయోగించుకోవాలి..
డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి..
మునుగోడు (విజయక్రాంతి): ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని దళారులను నమ్మి మోసపోవద్దని నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మునుగోడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పిపిసి సెంటర్ పులిపల్పుల, కల్వలపల్లి, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యం తేమ శాతం 17% ఉండే విధంగా తాలు, మట్టి, పెళ్లా లేకుండా శుభ్రంగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.
ప్రభుత్వమిచ్చే మద్దతు ధర గ్రేడ్ "ఏ" 2389 రూపాయలు సాధారణ 2369 రూపాయలు, సన్న వరి ధాన్యానికి 500 రూపాలు బోనస్ అందిస్తుందని ఇట్టి అవకాశాన్ని రైతులు వినియెగించుకోవాలని తెలిపారు. రైతులు నిబంధనలను పాటించి ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చేర్మెన్ దోటి నారాయణ, ఎంపిడిఓ యుగేందర్, మానిటరింగ్ అఫిసర్ రేణుక సంఘ డైరెక్టర్లు సింగం వెంకన్న, నన్నూరి శేఖర్ రెడ్డి, అగ్రికల్చర్ ఏఈఓ నరసింహ, సంఘ కార్యదర్శి సుఖేందర్, అశోక్ రెడ్డి, పురుషోత్తం, స్వామీనాధ్ లింగస్వామి, చంద్రశేఖర్ ప్రజా ప్రతినిధులు భీమనపల్లి సైదులు, తాటికొండ సైదులు, పుట్ట శ్రీనివాస్ రెడ్డి, ముఖ్య నాయకులు రైతులు ఉన్నారు.