20 June, 2026 | 4:08 PM

Breaking News

పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •  

స్థానిక సంస్థల ఎన్నికలపై గందరగోళ పరిస్థితులను సృష్టించిన కాంగ్రెస్ సర్కార్..

16-10-2025 06:38 PM

బిజెపి జిల్లా అధికార ప్రతినిధి, సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర..

కరీంనగర్ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు కావస్తున్న గ్రామ పాలనను గాడిలో పెట్టే ఆలోచన చేయకపోవడం దురదృష్టకరమని, రెండేళ్ల కాలంగా గ్రామ పరిపాలన వ్యవస్థ సక్రమంగా లేక  నేడు  గ్రామాలు అనేక సమస్యలతో  కొట్టుమిట్టాడుతున్నాయని  బిజెపి జిల్లా అధికార ప్రతినిధి, సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర అన్నారు. గురువారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక గ్రామాల అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన విమర్శించారు. 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్తామన్న కాంగ్రెస్ వైఖరి చూస్తుంటే, ఇప్పట్లో లోకల్ ఎలక్షన్స్ నిర్వహించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదనేది స్పష్టంగా అర్థమవుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై గందరగోళ పరిస్థితులను కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించింది అని విమర్శించారు.