calender_icon.png 22 June, 2025 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాడి అరెస్టు

22-06-2025 12:53:25 AM

50 లక్షలు ఇవ్వాలని క్వారీ వ్యాపారిని బెదిరించిన కేసులో..

  1. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి..
  2. కాజీపేట రైల్వే కోర్టుకు తరలింపు.. ఉత్కంఠ నడుమ బెయిల్‌పై విడుదల
  3. ఉదయం నుంచి రాత్రి వరకు ఉత్కంఠ 
  4. అవినీతిని ప్రశ్నించినందుకు అక్రమ కేసులు: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

హైదరాబాద్ సిటీ బ్యూరో/మహబూబాబాద్/హనుమకొండ, జూన్ 21 (విజ యక్రాంతి)/రాజేంద్రనగర్: హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని శనివారం తెల్లవారుజామున వరంగల్ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. క్వారీ వ్యాపారిని బెదిరించి రూ.50 లక్షలు డిమాండ్ చేసిన ఆరోపణలపై ఆయనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు హనుమకొండ నగరంలోని సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఎంజీఎం ఆసుపత్రి కి తరలించి వైద్య పరీక్షలు చేయించారు.

వైద్య పరీక్షల అనంతరం కౌశిక్‌రెడ్డిని కట్టుదిట్టమైన భద్రత మధ్య కాజీపేటలోని రైల్వే కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో మూడు గంటల పాటు వాదోపవాదాలు జరిగిన అనంతరం రాత్రి 8 గంటలకు న్యాయమూర్తి కౌశిక్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసులో తన ను అరెస్టు చేస్తారని తెలిసే కౌశిక్‌రెడ్డి విదేశాలకు పారిపోయేయత్నం చేశాడని తెలిసింది.

కాగా తెల్లవారుజామున కౌశిక్‌రెడ్డి అరెస్టు నుంచి మొదలుకొని రాత్రి 8 గంటల వరకు గంటల వరంగల్ నగరంలో ఉత్కంఠ నెలకొంది. కౌశిక్‌రెడ్డి అరెస్టు నేపథ్యంలో పోలీ సులు వరంగల్ నగరంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌశిక్‌రెడ్డి అరెస్టుపై అటు బీఆర్‌ఎస్, ఇటు కాంగ్రెస్ నేతలు పరస్పర విమర్శలు గుప్పించారు.

కేసు నేపథ్యం..

తమ క్వారీ వ్యాపారానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆటంకం కలిగించి, రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించారని హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని కమలాపూరం మండలం వంగపల్లి గ్రామంలో గ్రానైట్ క్వారీ నిర్వహిస్తున్న వ్యాపారి మనోజ్‌రెడ్డి భార్య ఉమాదేవి హనుమకొండ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బీఎన్‌ఎస్ 308 (2), 308 (4), 352 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని భావించిన కౌశిక్‌రెడ్డి..

ఈ నెల 16న ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.అయితే, ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, కేసును కొట్టివే యలేమని హైకోర్టు జస్టిస్ కె లక్ష్మణ్ ఈ నెల 17న తీర్పు ఇచ్చారు. కింది కోర్టులోనే విచారణ ఎదుర్కోవాలని కౌశిక్‌రెడ్డికి స్పష్టం చేశా రు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం శం షాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుబేదారి పోలీసులు కౌశిక్‌రెడ్డిని అదుపులో కి తీసుకున్నారు. అనంతరం విచారణ కోసం వరంగల్‌కు తరలించారు. 

అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులా: కౌశిక్‌రెడ్డి

ఆసుపత్రికి తరలించే ముందు కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీగా అవినీతి జరుగుతోందని, మం త్రి సీతక్క, ఎమ్మెల్యే కడియం శ్రీహరిలపై అక్ర మ మైనింగ్ ఆరోపణలు ఉన్నప్పటికీ వారిపై చర్యలు తీసుకోవడం లేదని సంచలన వ్యాఖ్య లు చేశారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులతో జైల్లో పెడుతున్నారని, ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. 

కౌశిక్‌రెడ్డి అరెస్టుతో ఉద్రిక్తత 

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసి వరంగల్ నగరంలోని సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తీసుకురాగా మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ఆధ్వ ర్యంలో పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు అక్కడికి చేరుకొని ఎమ్మెల్యే అరె స్టు అక్రమమంటూ నినాదాలు చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు విఫలయత్నం చేశారు.

దీంతో సుబేదారి పోలీ స్ స్టేషన్ నుంచి ఎంజీఎం వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అనంతరం అక్కడ నుంచి కౌశిక్‌రెడ్డిని కాజీపేట రైల్వే కోర్టు తీసుకు వచ్చేంతవరకు ఉద్రిక్తత కొనసాగింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మె ల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సతీమణి శాలినిరెడ్డి సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో కౌశిక్‌రెడ్డిని కలిసి అరెస్టు వివరాలు తెలుసుకున్నారు.అనంతరం పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్‌ను కలిసి కౌశిక్‌రెడ్డిని నోటీసు ఇవ్వకుం డా అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదన్నారు.

కౌశిక్‌రెడ్డి అరెస్టు కక్ష సాధింపు చర్య: మాజీ మంత్రి హరీశ్‌రావు

ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. పాలన గాలికి వదిలేసి, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని ఎక్స్‌లో పోస్టు చేశారు. రైతుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు కేసుల పేరిట అందర్నీ వేధిస్తూ రాక్షాసానందం పొందుతోందని మండిపడ్డారు. కేసులు, అరెస్టులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థుర్యైన్ని దెబ్బతీయవన్నారు. 

ప్రశ్నిస్తుంటే జీర్ణించుకోలేకే అరెస్టు: ఎమ్మెల్యే వేముల 

ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నిస్తుంటే జీర్ణించుకోలేకనే తమ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని అప్రజాస్వామ్యంగా అరెస్టు చేశారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ధైర్యంగా ఉంటామని, కోర్టులపై తమకు పూర్తి విశ్వాసముందన్నారు. 

ప్రశ్నించే గొంతులపై అణిచివేత: కేటీఆర్

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్టు దుర్మార్గమైన చర్య అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండి స్తున్నట్లు  చెప్పారు. సీఎం అక్రమాలను, మంత్రుల అవినీతిని, కాంగ్రెస్ నేతల దుర్మార్గాలను అడుగడునా కౌశిక్‌రెడ్డి ప్రశ్నిస్తున్నందునే ఆయనపై కక్షగట్టి కేసు లు బనాయిస్తున్నారని విమర్శించారు. తప్పుడు కేసులతో ఇబ్బందిపెట్టే కుట్ర అనేక నెలల నుంచి కొనసాగుతూనే ఉన్నదని ఆరోపించారు. తమ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అవి కోర్టు ల్లో నిలబడే అవకాశమే లేదన్నారు.