14-07-2025 04:20:01 PM
సదాశివనగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) సదాశివనగర్ మండల పద్మశాలి సంఘం నూతన కార్యవర్గన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలు ఎల్లారెడ్డి డివిజన్ అధ్యక్షులు దేవసాని పోశెట్టి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మామిడాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా జోర్రిగల నరసయ్య, కల్వరాల్, కోశాధికారిగా చౌకి రాజు, ఉపాధ్యక్షులుగా చౌకి కిషన్, మార సత్యనారాయణ, సహాయ కార్యదర్శులుగా తన్నీరు ఎల్లయ్య, సబ్బాని విశ్వనాథం, ప్రధాన సలహాదారులుగా తాటిపాముల సాందీప్, ముఖ్యసలహా దారులుగా చింతకింది సత్యం, దూడం ప్రవీణ్, మామిడి రాజేష్, పాముల రాములు, కార్యవర్గ సభ్యులుగా అంకం సతీష్, ఏశాల శ్రీనివాస్, జోర్రిగాల రాజశేఖర్, ఢీకొండ శ్రీధర్, మామిడి రాజేందర్ లను ఎన్నుకున్నారు.