10-06-2025 04:32:05 PM
అడహాక్ కమిటీ సభ్యులు పుట్ట సధానందం..
మందమర్రి (విజయక్రాంతి): ఈనెల 15న జరగనున్న పద్మశాలి సంఘం ఎన్నికలకు సంబంధించి ఓటర్ లిస్ట్ ను విడుదల చేశారు. పట్టణంలోని పద్మశాలి సంఘం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడహాక్ కమిటీ సభ్యులు పద్మశాలి సంఘంలో నమోదైన ఓటర్లకు సంబంధించి జాబితాను విడుదల చేసి పోటీలో ఉన్న అభ్యర్థులకు అందజేశారు. ఈ సందర్భంగా అడహాక్ కమిటీ సభ్యులు పుట్ట సదానందం(Putta Sadanandam) మాట్లాడుతూ.. మార్కెట్ ఏరియా పద్మశాలి సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈనెల 8వ తేదీ వరకు సభ్యత్వ నమోదు పూర్తి చేయడం జరిగిందన్నారు.
సభ్యత్వం కలిగిన వారు ఈనెల 15 జరగనున్న ఎన్నికలలో పాల్గొని నచ్చిన వారికి ఓటు వేసి గెలిపించు కోవాలని సూచించారు. ఈ నెల 13వ తేదీ సాయంత్రం 5 గం,, వరకు పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం పూర్తి చేసుకోవాలని నిర్ణీత సమయం తర్వాత ప్రచారం నిర్వహిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవ డం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.15వ తేదీన నిర్వహించనున్న ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా కుల బంధువులు పోటీలో ఉన్న అభ్యర్థులు కమిటీ సభ్యులకు సహకరించి ఎన్నికలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఓ రాజశేఖర్, రమేష్, శ్రీనివాస్ లతో పాటు పోటీలో ఉన్న అభ్యర్థులు పాల్గొన్నారు.