24-06-2025 11:05:20 AM
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): పాలమూరు మున్సిపల్ కమిషనర్(Palamuru Municipal Commissioner) మహేశ్వర్ రెడ్డి బదిలీ చేస్తూ ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నూతన మున్సిపల్ కమిషనర్ గా ప్రవీణ్ కు బాధ్యతలను అప్పగిస్తే అధికారులు జారీ చేసిన ఉత్తరంలో పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న మహేశ్వర్ రెడ్డి ని రాష్ట్ర కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత కొంతకాలంగా సెలవుల్లో ఉన్న ప్రవీణ్ నేరుగా మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ గా నేడు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. మహేశ్వర్ రెడ్డికి ఇతర మున్సిపల్ మరిదిని కేటాయించకపోవడంతో అసలు ఏం జరిగి ఉంటుందని పట్టణంలో తీవ్ర చర్చనీయాంశం అయింది.