17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

స్థానిక సమస్యల పరిష్కారమే అజెండా

08-02-2026 12:27 AM

ఇంటింటి ప్రచారంలో ముందడుగు

పాల్వంచ 47వ వార్డు సీపీఐ అభ్యర్థి జీవీఆర్ ప్రచార జోరు 

పాల్వంచ, ఫిబ్రవరి 7(విజయక్రాంతి): గత 27 ఏళ్లుగా స్థానిక సమస్యలతో సతమతమవుతున్న 47 వ డివిజన్ ప్రజానీకానికి స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని తెలుగుదేశం బలపరిచిన సీపీఐ అభ్యర్థి గుర్రం వెంకటేశ్వర్లు (జీవీఆర్) హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం డివిజన్ పరిధిలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. గత 27 ఏళ్లుగా పాలకవర్గం లేక పాల్వంచ పట్టణ వాసులు అనేక సమస్యలను ఎదుర్కొన్నారని, స్థానిక ఎమ్మెల్యే సాంబశివరావు చొరవతో కార్పొరేషన్ గా అభివృద్ధి చెంది ఎన్నికలకు శ్రీకారం చుట్టామన్నారు.

స్థానిక సమస్యల పరిష్కారం కావాలన్నా, డివిజన్ పరిధిలో అభివృద్ధి జరగాలన్న కంకి కొడవలే గుర్తుకే అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ప్రధానంగా అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను పునర్ నిర్మాణం, వీధి దీపాలు ఏర్పాటు చేయడం, అర్హులైన నిరుపేదలకు వితంతు, వృద్ధాప్య, దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు అందజేయడం, పాత పాల్వంచలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఓటర్లు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రచారంలో గుమ్మడవెల్లి శ్రీనివాస్, గోపాల్ పాల్గొన్నారు.