16 April, 2026 | 10:18 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ఎస్పీఎఫ్ సిబ్బందికి కోటి భరోసా

08-02-2026 12:30 AM
  1. ఎస్బీఐతో కీలక ఒప్పందం
  2. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.కోటి బీమా
  3. యాక్సిడెంట్‌కు రూ.1.60 కోట్లు

హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 07 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) సిబ్బంది సంక్షేమమే ధ్యేయంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒక ప్రత్యేకమైన శాలరీ ప్యాకేజీ ఒప్పందం కుదిరింది. శనివారం సికింద్రాబాద్‌లోని ఎస్పీఎఫ్ ప్రధాన కార్యాలయం లో డైరెక్టర్ జనరల్ స్వాతిలక్రా సమక్షంలో ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందం ద్వారా ఎస్పీఎఫ్ సిబ్బందికి అత్యున్నత స్థాయి బీమా కవరేజీ లభించనుంది.

విధి నిర్వహణలో లేదా ఇతర ప్రమాదాల్లో మరణిస్తే ఎటువంటి నిబంధనలు లేకుండా ఒక కోటి రూపాయల వ్యక్తిగత ప్రమాద బీమా అందుతుంది. ఒకవేళ విమాన ప్రమాదం జరిగితే ఈ మొత్తం రూ.1.60 కోట్లుగా ఉంటుంది. ఉగ్రవాదులు లేదా నక్సలైట్లతో పోరాడుతూ అమరులైన వారికి అదనంగా మరో రూ.10 లక్షల కవరేజీని కల్పించారు. శాశ్వత లేదా పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే గరిష్టం గా రూ.80 లక్షల వరకు పరిహారం లభిస్తుంది.

ఉద్యోగి మరణిస్తే పిల్లల ఉన్నత చదువుల కోసం కుమారుడికి రూ.28 లక్షలు, కుమార్తెకు రూ.10 లక్షల వరకు సహాయం అందుతుంది. అలాగే ఇద్దరు కుమార్తెల వివాహాల కోసం రూ.10 లక్షల వరకు ఆర్థిక వెసులుబాటు కల్పించారు. వైద్య ఖర్చుల కింద ప్లాస్టిక్ సర్జరీకి రూ.10 లక్షలు, ఎయిర్ అంబులెన్స్ ఖర్చులకు రూ.10 లక్షల వరకు బీమా వర్తిస్తుంది.