27-06-2025 02:05:44 AM
-కథనానికి స్పందించిన సీసీ కుంట తహసీల్దార్ ఎల్లయ్య
చిన్న చింతకుంట జూన్ 26 : అక్రమంగా ఇసుక తరలింపుకు ఎద్దుల బండ్లతో ఎత్తివే స్తున్నారని విజయ క్రాంతి దినపత్రిక నందు గురువారం ప్రత్యేక కథనం ప్రచురితం అ యిన విషయం విధితమే. ఈ కథనానికి తాసిల్దార్ ఎల్లయ్య స్పందించి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ప్రాంతాలను, ఇసు క డంపులను ప్రత్యేకంగా తనిఖీ చేశారు.
ఎద్దుల బండ్లు వాగులోకి పోయేందుకు అనుమతి లేదని, అనుమతి తీసుకొని మాత్రమే ఇసుక తరలింపు చేయాలన్నారు. అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అల్లిపూర్ తండాలో ఇసుక డంపులను సీజ్ చేసినట్లు తాసిల్దార్ ఎల్లయ్య స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని వారిపై శాఖపరమైనటువంటి చర్యలు తీసుకుంటామనితెలియజేశారు.