12 March, 2026 | 6:08 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

జాతీయ స్థాయి జూడో చాంఫియన్ షిప్ పోటీలకు పారమిత విద్యార్థి

20-01-2026 07:16 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): జాతీయ పాఠశాలల క్రీడా సమాఖ్య ఆద్వర్యంలో మణిపూర్ రాష్ట్రంలో ఈనెల 21 నుండి 25 వరకు జరుగనున్న 69 వ యస్. జి. యఫ్. అండర్-17 బాల బాలికల జాతీయ స్థాయి జూడో చాంపియన్ షిప్ పోటీలకు, బాలుర 90 కిలోల పై విభాగంలో స్థానిక పద్మనగర్  పారమిత హెరిటేజ్ పాఠశా విద్యార్థి  తాటికొండ రణవీర్ రాజ్ ఎంపికైనట్లు పాఠశాల డైరెక్టర్ కె. హన్మంతరావు తెలిపారు.

రాష్ట్రస్థాయి పాఠశాలల క్రీడా సమాఖ్య ఆద్వర్యంలో ఇటీవల హన్మకొండ లోని నెహ్రు ఇండోర్ స్టేడియంలో జరిగిన 69 వ ఎస్జీఎఫ్ రాఫ్ట్ర స్థాయి అండర్-17 బాలుర 90 కేజీలపై విభాగంలో టి.రణవీర్ రాజ్ (గోల్డ్  మెడల్) , 73 కేజీల విభాగంలో ఎ.అభినవ్ సాయి (సిల్వర్ మెడల్) సాధించారు. జాతీయ స్థాయి పోటీలలో పాల్గొననున్న టి.రణవీర్ రాజ్ ను, రాష్ట్రస్థాయిలో  పతకం  సాధించిన అభినవ్ సాయిని పారమిత పాఠశాలల అధినేత డా. ఇ. ప్రసాదరావు, డైరెక్టర్స్ ప్రసూన, అనూకర్ రావు, రశ్మిత, వినోద్ రావు, వి.యు.యం.ప్రసాద్, హన్మంతరావు, ప్రధానోపాద్యాయుడు గోపిక్రిష్ణ, సమన్వయకర్త రబీంద్ర పాత్రో, వ్యాయామ ఉపాధ్యాయులు గోలి సుధాకర్, యస్.రాజు, ఉపాధ్యాయులు అభినందించారు.