20-01-2026 07:12:55 PM
సిద్దిపేట క్రైం: నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపిన ఏడుగురికి న్యాయమూర్తి జరిమానా విధించారని ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇటీవల సిద్దిపేట పట్టణంలోని పలు చౌరస్తాలలో నిర్వహించిన తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన ఐదుగురు పట్టుబడ్డారని చెప్పారు.
వారిని సోమవారం సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ఎదుట హాజరుపరుచగా ఐదుగురికి కలిపి రూ.50వేల 5 వందలు జరిమానా విధించారని తెలిపారు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన ఇద్దరికి రూ.5వేల చొప్పున జరిమానా విధించారని పేర్కొన్నారు.