15 April, 2026 | 1:16 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

గాంధీ విగ్రహానికి పార్ట్ టైం అధ్యాపకుల వినతి

28-04-2025 03:41 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణ పార్ట్ టైం అధ్యాపకులు ఏడవ రోజు సమ్మెలో భాగంగా సోమవారం తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, గాంధీ దృష్టిలో విద్య అనేది సమానత్వం సాధించడానికి ఒక సాధనమని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని గాంధీ అభిప్రాయపడ్డారు. 

విశ్వవిద్యాలయాలలో పనిచేసే అధ్యాపకుల విద్య దేశాభివృద్ధికి తోడ్పడుతుందనీ, అలాంటి విశ్వవిద్యాలయాలలో నేడు పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల జీవితాలకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని అన్నారు. తమకు ఇప్పటివరకు కనీస వేతనం కూడా లేదని అన్నారు. జి.ఓ 21 ని సవరించి తమ సర్వీసులను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇకనైనా పార్ట్ టైం అధ్యాపకుల న్యాయపరమైన డిమాండ్లను గుర్తించి తమకు న్యాయం చేయాలని అన్నారు. కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన పార్ట్ టైం అధ్యాపకులు పాల్గొన్నారు.