17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

28-04-2025 03:45 PM

హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు పర్వత కోటేష్

మహబూబాబాద్,(విజయక్రాంతి): హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఐఎఫ్టియు అనుబంధ హమాలీ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పర్వత కోటేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 139వ మేడే ను జయప్రదం చేయాలని కోరుతూ ఐఎఫ్టియు జాతీయ కమిటీ ముద్రించిన గోడ పత్రికలను సోమవారం మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ లో ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో పర్వత కోటేష్ మాట్లాడుతూ... స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా నిత్యం బరువులు మోసే హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, 139వ మే డే లో కార్మికులు సంపూర్ణంగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సురేష్, లింగన్న, రామ్మూర్తి, ఉప్పలయ్య, వెంకన్న, రవి, వెంకటేష్, అంజయ్య  తదితరులు పాల్గొన్నారు.