28 August, 2026 | 2:35 PM

Breaking News

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి   •   మల్లాపూర్‌లో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు   •   తాజుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన నామనాగేశ్వరరావు   •   కోటపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో రాఖీ పౌర్ణమి వేడుకలు   •   ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు   •   రాఖీ కట్టేందుకు వెళ్తుండగా ప్రమాదం.. మహిళకు తీవ్రగాయాలు   •   ప్రధాని మోదీ, తల్లిదండ్రులపై ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్ట్   •   ఎమ్మెల్యే పోచారంకు రాఖీ కట్టిన సోదరిమణి దొడ్ల సత్యవతి   •   విద్యుత్ పోరాట అమరవీరుల స్పూర్తితో భవిష్యత్ పోరాటాలు   •   ప్రయాణికుల కష్టాలు తీర్చేలా ఆర్‌ఓబీ పనులు వేగవంతం చేయాలి   •  

కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు

28-08-2026 01:28 PM

పండుగ వేళ ప్రయాణికుల అవస్థలు

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రాఖీ పౌర్ణమి(Rakhi Festival) సందర్భంగా జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌తో పాటు మండల కేంద్రాల్లోని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. అన్నదమ్ములకు రాఖీలు కట్టేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తమ స్వగ్రామాలకు బయలుదేరడంతో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో ప్రతి బస్సు మహిళలు, ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఒక్కో బస్సులో 70 నుంచి 80 మంది వరకు ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపినప్పటికీ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు సరిపోకపోవడంతో అవస్థలు తప్పలేదు. బస్టాండ్లలో గంటల తరబడి వేచి చూసిన ప్రయాణికులు బస్సు రాగానే ఎక్కేందుకు పోటీపడ్డారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.