07-08-2025 10:39:20 PM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్..
కామారెడ్డి (విజయక్రాంతి): ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం వద్ద రాత్రి వేళలో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(District Collector Ashish Sangwan) పోలీసులను ఆదేశించారు. గురువారం కామారెడ్డి మండలం గర్గుల్లో ఉన్న ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఉన్న రోజులను వైద్య సేవలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలో ఆకతాయిలు రాత్రి వేళలో తీస్తే వేస్తున్నారని ఫిర్యాదులు వచ్చినందున పెట్రోలింగ్ చేయాలని పోలీసులకు సూచించారు. ఆరోగ్య కేంద్రంలోని మౌలిక వసతులను రోగులకు అందుతున్న సేవలను గురించి ఆరా తీశారు. ఆయన వెంట డిఎంహెచ్వో చంద్రశేఖర్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ ప్రభు కిరణ్ ,మండల వైద్యాధికారి జోహా ముజీబ్, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.