అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. పవన్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా టీజర్ మే 2వ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర బృందం ఓ ప్రకటన చేశారు. చారిత్రక నేపథ్యంలో ఏఎం రత్నం మరియు ఎ దయాకరరావు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.
కీరవాణి సంగీత దర్శకుడు. కొవిడ్ సహా ఇతరత్రా కారణాల వల్ల వీరమల్లు సహా పలు పవన్ సినిమాల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరికొద్ది రోజుల్లో ఎలక్షన్ల హడావుడి ఎటూ ముగియనుంది. దాంతో ఇప్పటికే ఒప్పుకున్న సినిమాల చిత్రీకరణను చకాచకా పూర్తి చేయనున్నారట పవన్. ఆయన కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న ‘ఓజీ’ ఇప్పటికే విడుదల తేదీని ఖాయం చేసుకోగా, హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘ఉస్తాద్ భగత్సింగ్’తో ‘హరిహర వీరమల్లు’ చిత్రాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.