‘ప్రసన్న వదనం’కు యు/ఎ

01-05-2024 12:15:00 AM

సుహాస్ కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ప్రసన్న వదనం’. మణికంఠ, ప్రసాద్ రెడ్డి  నిర్మించిన ఈ చిత్రంతో అర్జున్ వై.కె. దర్శకుడిగా పరిచయవుతున్నారు. ముఖాన్ని గుర్తించలేకపోవడం అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా మే 3న విడుదల కానుండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. థ్రిల్లర్‌గా రానున్న ఈసినిమాకి సెన్సాన్ వారు యు/ఎ సర్టిఫికెట్‌ను జారీచేశారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్, నందు, వైవా హర్ష తదితరులు తారాగణంగా రూపొందిన ఈ సినిమాకి విజయ్ బుల్గానిన్ సంగీత దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. సుకుమార్ వద్ద శిష్యరికం చేసిన వారంతా దర్శకులుగా మారి మంచి విజయాలు అందుకుంటున్న తరుణంలో అర్జున్ వై కె ఆ జాబితాలో చేరనున్నాడా లేదా అన్నది మే 3న తేలనుంది.