calender_icon.png 5 June, 2025 | 4:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైకిల్ ప్రేమికునికి సన్మానం

03-06-2025 09:05:27 PM

కోదాడ: ప్రపంచ సైకిల్ దినోత్సవ సందర్భంగా కోదాడ వాసి, సైకిల్ ప్రేమికుడు, ఇప్పటి వరకు 3,50,000 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించిన 71 సంవత్సరాల వ్యక్తి పెయింటర్ బాబుని కోదాడ యం యస్ విద్యా సంస్థలలో పందిరి ఫౌండేషన్ చైర్మన్ పందిరి నాగిరెడ్డి, ఫౌండేషన్ గౌరవ సలహాదారు యస్ యస్ రావు లు మంగళవారం శాలువాతో సన్మానించారు. బాబుకు ఆర్థిక చేయూత అందించారు. సన్మాన గ్రహీత సైకిల్ ప్రేమికుడు బాబు మాట్లాడుతూ... సైకిల్ తొక్కడం రోజుకి ఐదు నుంచి పది కిలోమీటర్లు సైకిల్ ప్రయాణం ఆరోగ్యానికి మంచిదని ప్రతి ఒక్కళ్ళు సైకిల్ ప్రయాణంతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండొచ్చని అన్నారు. ఈ ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి చిన్ని, తేజ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ పి.యాదగిరి రెడ్డి, కళాశాల సిబ్బంది జి. నాగేశ్వరరావు, బి .నాగేశ్వరరావు, జానీ మియా పాల్గొన్నారు.