07-11-2025 08:35:53 PM
చండూరు,(విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రధామావశాత్తు చెట్ల పైనుంచి పడి మరణించిన కల్లు గీత కార్మికులకు చెల్లించాల్సిన రూ.13 కోట్ల ఎక్స్గ్రేషియో బకాయిలను వెంటనే విడుదల చేయాలని జిల్లా సహాయ కార్యదర్శి పల్లె శంకరయ్య గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం చండూరు ఎక్సైజ్ కార్యాలయంలో ఆప్కారి సీఐ పద్మను కలిసి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శంకరయ్య గౌడ్ మాట్లాడుతూ... గీత కార్మికులందరికీ వృత్తి రక్షణ కవచాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
గీత వృత్తిలో పనిచేస్తూ చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియోను 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచి, తాత్కాలిక గాయాలతో బాధితులైన వారికి రెండు చెల్లించాలని,మెడికల్ బోర్డు విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ సివిల్ అసిస్టెంట్ సర్జన్ పర్యవేక్షణలో శాశ్వత వికలాంగుల నిర్ధారణ సర్టిఫికెట్ పద్ధతిని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని అన్ని కళ్ళుగీత సహకార సంఘాలు, టి ఎఫ్ టి లకు శాశ్వత లైసెన్స్ అర్హులైన అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.