calender_icon.png 19 January, 2026 | 10:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ పీఎఫ్ డబ్బులు ఖాతాలో జమచేయాలి

19-01-2026 06:23:31 PM

బల్దియా ఎదుట కార్మికుల ధర్నా

కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): గత రెండేళ్లుగా పెండింగ్​లో ఉన్న పీఎఫ్ బకాయిలను తక్షణమే ఖాతాల్లో జమచేయాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. పెండింగ్​లో ఉన్న ప్రావిడెంట్ ఫండ్  డబ్బులను కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన కార్మికుల స్థానంలో వారి కుటుంబసభ్యులను నియమించాలన్నారు. అకారణంగా విధులు నుండి తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, సీఐటీయూ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు