19 May, 2026 | 11:28 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

కార్మికుని కుటుంబానికి అండగా ఉంటాం

19-01-2026 06:28 PM

రూ.15000 ఆర్థిక సహాయం

భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నేత కొండ ఉప్పలయ్య

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బురహాన్ పురం గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన గ్రామ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు జాంపల్లి బాలరాజు కుటుంబానికి సంఘం అండగా ఉంటుందని భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు)జిల్లా నాయకులు కొండ ఉప్పలయ్య తెలిపారు. సోమవారం బురహాను పురం గ్రామంలో ఆయన 10వ రోజు దశదినకర్మ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అంతేగాక తోటి కార్మికులు ఆ కుటుంబానికి ఆర్థిక తోడ్పాటును అందించడానికి రూ:15000/- అందించి కుటుంబానికి భరోసాగా నిలిచారు.