పెండింగ్ వేతనాలు చెల్లించాలి
25-06-2024 05:44 AM
కలెక్టరేట్ ఎదుట పంచాయతీ కార్మికుల ధర్నా
మెదక్, జూన్ 24 (విజయక్రాంతి): ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం మెదక్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు సుధాకర్ మాట్లాడుతూ.. గత 8 నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. మల్టీపర్పస్ పని విధానం రద్దు చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీపీవో యాదగిరికి అందజేశారు. ధర్నాలో సీఐటీ యూ జిల్లా కార్యదర్శి బస్వరాజు, కోశాధి కారి నర్సమ్మ, గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి ఆసీఫ్ తదితరులు పాల్గొన్నారు.






