13-06-2025 09:02:32 PM
భద్రాచలం,(విజయక్రాంతి): 1999 నుండి 2004 మధ్యకాలంలో విద్యుత్ సంస్థలో చేరిన ఉద్యోగులు తమకి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షన్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే, ఎంపీలకు తమ వినతి పత్రాలను సమర్పిస్తున్నారు. అందులో భాగంగా విద్యుత్ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ సంఘం (JAC) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సభ్యులు శుక్రవారం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుని కలిసి తమకి పెన్షన్ సౌకర్యం కల్పించవలసిందిగా వినతిపత్రం అందజేశారు. దీనికి తెల్లం వెంకట్రావు సానుకూలంగా స్పందించి తాను కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి , ఉపముఖ్యమంత్రి ల దృష్టికి తీసుకువెళ్తానని త్వరలోనే తమ ప్రభుత్వం తీపి కబురు అంద జేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం డి ఇ కె. జీవన్ కుమార్ , ఓ సి అసోసియేషన్ తరపున భద్రాచలం ఏ డి ఇ టి వేణు, డిప్లమా అసోసియేషన్ తరపున కె రాజారావు, 1104 యూనియన్ జిల్లా అధ్యక్షులు అశోక్ , 327 యూనియన్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ , సి ఐ టి యు యూనియన్ ఎంపీడీసీఎల్ కంపెనీ సెక్రటరీ వెంకటరాజు , ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ జిల్లా నాయకులు ఉదయ్ రత్నకుమార్, ఇతర అసోసియేషన్స్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.