calender_icon.png 14 June, 2025 | 2:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానుకోట,కేసముద్రం అభివృద్ధికి రూ.150 కోట్లు మంజూరు

13-06-2025 09:56:28 PM

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే 

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ కేసముద్రం మున్సిపాలిటీ పట్టణ అభివృద్ధికి వంద కోట్లు, మహబూబాబాద్ పట్టణ అభివృద్ధికి 50 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని, మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి 150 కోట్ల రూపాయలు కేటాయించారని ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ తెలిపారు. 150 కోట్లు అభివృద్ధి పనుల కోసం కేటాయించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. 150 కోట్ల రూపాయలతో మహబూబాబాద్, కేసముద్రం పట్టణాల్లో డ్రైనేజీ, రోడ్లు, పార్కులు, ఇతర మౌలిక వసతుల కోసం కేటాయించడం జరుగుతుందని తెలిపారు. అలాగే మహబూబాబాద్ పట్టణం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని సీఎం ను కోరగా సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.