22 May, 2026 | 7:59 PM

Breaking News

బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •  

బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి

22-05-2026 07:26 PM

బోధన్,(విజయక్రాంతి): రుద్రూర్ మండల కేంద్రంలో ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (TUCI) బోధన్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో బీడీ కార్మికులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.4000 పెన్షన్ అందజేయాలని శుక్రవారం ధర్నా నిర్వహించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం చేయూత పథకం ద్వారా వెంటనే ఈ మొత్తాన్ని చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అంగడి బజారు నుండి సమీకృత మండల కార్యాలయాల భవన సముదాయం వరకు ర్యాలీగా వచ్చి నిరసన తెలిపారు.