బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు
22-05-2026 07:54 PM
గరిడేపల్లి,(విజయక్రాంతి): ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముత్తినేని శ్రీనివాస్ కుటుంబాన్ని రాష్ట్ర తొలి కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షుడు బంధు శ్రీధర్ బాబుతో కలిసి మండలంలోని కీతవారిగూడెంలో శుక్రవారం పరామర్శించి మాట్లాడారు. రాష్ట్రంలోనే పెరిక కుటుంబ సభ్యులను ఆదుకోవడంలో కుల సంఘం ఎల్లప్పుడూ సహయ సహకారాలు అందించడంతో పాటు బాధిత కుటుంబానికి భవిష్యత్తులో ఆదుకుంటామని అయన తెలిపారు.అనంతరం బాధిత కుటుంబానికి రూ.75 వేల రూపాయల నగదు అందజేశారు.






