calender_icon.png 5 June, 2025 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిమ్మాజిపేటలోనే కొనసాగుతాం..!

03-06-2025 05:19:35 PM

జిల్లా కలెక్టర్ ను కోరిన గొరిట గ్రామస్థులు..

నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): తమ గ్రామాన్ని తిమ్మాజిపేట మండలంలోనే కొనసాగించాలని కోరుతూ తిమ్మాజిపేట్ మండలం(Thimmajipet Mandal) గొరిట గ్రామస్తులు మంగళవారం జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్(District Collector Badavath Santosh)ను కలిసి వినతి పత్రాన్ని అందించారు. నూతన మండలాల ఏర్పాటు ప్రతిపాదనలో భాగంగా ఇటీవల గోరిట గ్రామాన్ని మంగనూరు మండలంలో చేర్చే ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో కలెక్టర్ కార్యాలయం వద్ద చేరుకుని, "మా గ్రామం చుట్టుపక్కల అన్ని సదుపాయాలు తిమ్మాజీపేట మండలంలోనే ఉన్నాయి. విద్య, వైద్య, రవాణా, ప్రభుత్వ సేవలు అన్నీ తిమ్మాజీపేట నుంచే పొందుతున్నామని పేర్కొన్నారు.

మంగనూరు మండలానికి మారితే ప్రజలకు అనేక ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. గ్రామస్తుల తరఫున పలువురు నాయకులు మాట్లాడుతూ... గత కొంతకాలంగా తిమ్మాజీపేట మండలానికి మాకు ముద్రపడిపోయింది. పరిపాలనా, ప్రజాసేవల పరంగా మంగళూరు మండలంలో కలిపితే మాకు అన్యాయం జరుగుతుంది. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని, గొరిట గ్రామాన్ని తిమ్మాజీపేట మండలంలోనే కొనసాగించాలని కలెక్టర్ ని కోరారు. కలెక్టర్ వినతి పత్రాన్ని స్వీకరించి, తగిన విచారణ అనంతరం నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.