తంగళ్ళపల్లి మౌలిక వసతుల కొరతపై కలెక్టర్కు వినతి
12-01-2026 09:20 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బస్టాండ్, ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని గ్రామ, మండల కేంద్ర నివాసులు జిల్లా కలెక్టర్ను కోరారు. మండలంగా ఏర్పడి ఎన్నేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు బస్టాండ్, మరుగుదొడ్ల అభివృద్ధి జరగలేదని తెలిపారు. సుమారు 10 వేల జనాభా ఉన్న ప్రాంతంలో ఈ సదుపాయాల లేమి వల్ల ప్రజలు, ముఖ్యంగా మహిళలు, మహిళా విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొని, ప్రత్యేక ప్రభుత్వ నిధులు మంజూరు చేసి వెంటనే పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.






