12 June, 2026 | 12:08 PM

Breaking News

తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •   భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత   •   జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి   •  

కీసరగుట్ట ఆలయ అభివృద్ధి పనులపై మున్సిపల్ కమిషనర్‌కు వినతి

30-10-2025 12:35 AM

కీసర  , అక్టోబరు 29(విజయక్రాంతి  ): కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం పరిసర ప్రాంతాల అభివృద్ధి పనుల కోసం ఆలయ ఛైర్మన్ తటాకం నారాయణ శర్మ, ఆలయ ఈవో  కట్ట సుధాకర్ రెడ్డి బుదవారం  మున్సిపల్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.  శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కీసరగుట్ట ఆలయ పరిసర ప్రాంతంలో గల నందీశ్వరుడు దగ్గర నుంచి తామరకొలను వరకు రోడ్డు విస్తరణ పనుల అభివృద్ధి కొరకు,   ఆలయ పశ్చిమ గోపురం తూర్పు గోపురం దగ్గర సిసి రోడ్డు గురించి ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మగారు ఆలయ ఈవో కట్ట సుధాకర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ వెంకట్ రెడ్డిని కలిసి వినతిపత్రం  అదజేశారు మున్సిపల్ కమిషనర్ వెంకట్ రెడ్డి  తక్షణమే స్పందించారు.  ఆలయ  అభివృద్ధికి సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.