12 June, 2026 | 1:15 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •   ప్రముఖ 'మాండ్' గాయని గావ్రీ దేవి కన్నుమూత   •   తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •  

ధాన్యం నిరాకరించిన రైస్ మిల్ యాజమాన్యం

30-10-2025 12:36 AM

రైస్ మిల్ ముందు రైతుల నిరసన

కొల్చారం, అక్టోబర్ 29 :కొల్చారం మం డల కేంద్రంలోని సత్యసాయి రైస్ మిల్ వద్ద బుధవారం రైతులు ఆందోళనకు దిగారు. పోతిరెడ్డిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి ధాన్యం బస్తాలు తీసుకువచ్చిన రవా ణా లారీని రైస్మిల్ యాజమాన్యం దిగుమతి చేయమంటూ అడ్డుకోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కేటాయించిన రైస్మిల్కే ధాన్యం బస్తాలు తీసుకొ చ్చామని, నిరాకరిస్తే మేమేం చేయాలి అం టూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికే వర్షాలు రైతులకు ఆందోళనకు గురిచే స్తున్నాయని, మిల్లుకు వచ్చిన ధాన్యం లారీలను రెండు రోజులుగా రోడ్డుపై నిలిపివే యడంతో ధాన్యం తడిసి నాశనం అయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ విషయం కొల్చారం మండల వ్యవసాయ అధికారికి, తహసిల్దార్ కు జిల్లా పౌరసరఫరాల అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకుంటే పెద్ద ఎత్తున రైతులను తీసుకొచ్చి ఆందోళన చేయనున్నట్లు తెలిపారు.