calender_icon.png 23 June, 2025 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ సమస్యలపై సెక్రెటరీకి వినతిపత్రం..

23-06-2025 08:02:21 PM

బానోత్ రాము నాయక్..

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి..

కొత్తగూడెం (విజయక్రాంతి): రేగా కాంతారావు ఆదేశానుసారం నియోజకవర్గ ఇన్చార్జి మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు(Former Minister Vanama Venkateswara Rao) నాయకత్వంలో చుంచుపల్లి మండలం 4 ఇంక్లైన్ బిఆర్ఎస్ ఇంచార్జ్ బానోత్ రాము నాయక్ ఆధ్వర్యంలో 4 ఇంక్లైన్ పంచాయతీ కార్యదర్శి నర్మదకు సోమవారం వినతిపత్రం బిఆర్ఎస్ నాయకులు అందజేశారు. గ్రామాల్లో ప్రధానంగా నెలకొన్న సమస్యలతో పాటు ఎన్నికల సమయంలో, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలను తక్షణమే పరిష్కరించాలని బానోత్ రాము నాయక్  డిమాండ్ చేశారు.

ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు అర్హత కలిగిన ప్రతీ పేదవాడికి మంజూరు చేయాలని, సైడు కాలవలో చెత్తా చెదారం పిచ్చిమొక్కలు వెంటనే తొలగించి బ్లీచింగ్ పౌడరు చల్లించాలని, ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. మంచినీటి బావులు నీటి నిల్వ ఉన్నచోట తక్షణమే బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని, వీదిలైట్లు వెంటనే వేయించాలని, ఇండ్లలో చెత్తను ప్రతి రోజు సేకరించి డంపుయార్డుకు తరలించాలని, దోమల నివారణకు చర్యలు చేపట్టాలని, పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న గ్రామాలలో పేరుకు పోయిన అనేక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

అబద్దాలతో మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ప్రజల జీవితాలతో ఆడుకుంటూ, టైం పాస్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఆయన ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో నున్నవత్ వస్య, నున్నవత్ తార, నున్నావత్ వెంకటేష్, భుక్య ధనరాజ బానోత్  నందు, బానోత్  పండు, సురేష్, రామంచి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.