calender_icon.png 23 June, 2025 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ పై అవగాహన సదస్సు..

23-06-2025 07:58:15 PM

లక్షేట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని గుడ్ షఫెర్డ్ విద్యార్థులకు పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన సదస్సును సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సురేష్(SI Suresh) మాట్లాడుతూ.... డ్రగ్స్ వాడటం వల్ల కలిగే నష్టాల గురించి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. చాలామంది విద్యార్థులు డ్రగ్స్ బారిన పడి వారి విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్న సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ఎవరు డ్రగ్స్ కు అలవాటు కావద్దు అని సూచించారు. 

విద్యార్థి దశ చాలా కీలకం కాబట్టి చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై శ్రద్ధ వహించి పట్టుదల క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకోని రావాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి మానవాళి మనుగడకు మొక్కలు చాలా అవసరం అని ప్రతి ఒక్కరు విధిగా తమ పరిసరాల్లో మొక్కలను నాటి వాటిని పరిరక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండంట్ వై.శ్రీనివాస్, ప్రిన్సిపాల్ సెభాస్టియన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.