అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, మే 12 (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్క రించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సంబంధిత శాఖ అధికారుల ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 107 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ వినోద్ కుమార్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
కాగా భు సమస్యలు, పెన్షన్, ఇందిరమ్మ ఇళ్లు, విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, %ఖిగీళి%, తదితర శాఖలకు సంబంధించి అర్జీలను స్వీకరించి ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రజావాణి లో వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






