29 June, 2026 | 10:05 PM

Breaking News

కార్మిక సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు: కె. సారయ్య   •   జర్నలిస్టుల ముందస్తు అరెస్టులు ఖండనీయం : కొర్ర శ్రీను నాయక్   •   హనుమంతులపాడులో ఘనంగా గంగమ్మ తల్లి బోనాల ఉత్సవాలు   •   ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీ గురు పీఠంలో ప్రత్యేక పూజలు   •   ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా ట్యాంకుల నిర్మాణం   •   నకిలీ విత్తనాలు, పురుగుమందులను అరికట్టాలి   •   బోడుప్పల్–చెంగిచెర్ల రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలి   •   ప్రతి గ్రామ సంఘంలో మూడు రకాల సంఘాలు చేయాలి   •   జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది   •   మత మార్పిడి ప్రయత్నాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి   •  

చికిత్స పొందుతూ పెట్రోల్ బంక్ మేనేజర్ మృతి..

19-03-2025 10:19 PM

మునిపల్లి: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుదేరాలోని హెచ్ పి పెట్రోల్ బంక్ మేనేజర్ మృతి చెందిన సంఘటన ఇది. మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరికి చెందిన నితీష్ కుమార్ (28) గత కొంత కాలంగా మునిపల్లి మండలంలోని బుదేరా చౌరస్తాలో గల హెచ్ పి పెట్రోల్ బంక్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. బాంక్ కు సంబంధించిన షెడ్డుకు సంబంధించిన రేకులు పగిలిపోవడంతో మరమ్మతులు చేసేందుకు ప్రయత్నం చేశారు. మంగళవారం పరిశీలించేందుకు షెడ్ పైకి ఎక్కాడంతో ప్రమాదవశాత్తు రేకుల షెడ్డు పైనుండి కింద జారి పడటంతో తలకు బలమైన గాయాలు అయ్యాయి. సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుని తండ్రి చంద్రమౌళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజేష్ నాయక్ తెలిపారు.