21-06-2025 12:16:24 AM
ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్.వి.రాజేంద్ర ప్రసాద్
మహబూబ్ నగర్ జూన్ 20 (విజయ క్రాంతి) : ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో ప్రవేశం పొందేందుకు దోస్త్ ప్రవేశాలలో ఫేజ్ -3 రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఈనెల 25వ తేదీ వరకు ఉందని ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వి రాజేంద్రప్రసాద్ అన్నారు.
దోస్త్ ప్రవేశాలకు ఫేజ్ 1, ఫేజ్ 2 లలో సెల్స్ రిపోర్టింగ్ చేసుకుని కళాశాలలో కన్పర్మేషన్ చేసుకున్న విద్యార్థులు జూన్ 26 నుండి 30 వరకు కళాశాలలో సర్టిఫికెట్స్ ధృవీకరణ చేసి రిపోర్టింగ్ చేయాలి అలాగే దొస్త్ ఫేజ్-2 లో సీట్ల కేటాయింపు అయిన విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ జూన్ 25 వరకు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం దొస్త్ ఫేజ్-3 లో రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు మరియు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి చివరి తేది జూన్ 25 వరకు అవకాశం ఉందన్నారు.
మా కళాశాలలో నూతనంగా అప్రెంటిసిప్ సెక్టార్ స్కిల్ కోర్సులైన బి.కామ్ లో బి. ఎఫ్.ఎస్.ఐ, బి.యస్సీ లో మార్కెటింగ్ సేల్స్ అండ్ ఫార్మా మెడిటెక్ కోర్సులను ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించామని, ఈకోర్సులో జాయిన్ అయిన విద్యార్థులకు రెగ్యులర్ క్లాసులతో పాటు నైపుణ్యశిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఈ కోర్సుల్లో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, విద్యార్థులంతా ఈ సదావకాణాన్ని సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థులు దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో ఏదైనా సమస్యలు ఎదురైనచో వారు మా కళాశాలలోని వాలంటరీ హెల్ప్ లైన్ సెంటర్ కోఆర్డినేటర్ మధుసూదన్ శర్మ 9440842201ను సంప్రదించి పరిష్కారం పొందవచ్చని తెలిపారు.