21-06-2025 12:14:49 AM
అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు
కొత్తకోట, జూన్ 20 : కొత్తకోట మండలం చెర్లపల్లిలో రేషన్ దుకాణం మార్కెట్ గోడౌన్ కు శుక్రవారం అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లుస్థల పరిశీలన చేసారు. అనంతరం చెర్లపల్లి గ్రామంలో చౌక ధర దుకాణాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ దుకాణంలో పంపిణీ అవుతున్న బియ్యం నాణ్యతను స్వయంగా పరిశీలించారు.
రేషన్ లబ్ధిదారులతో నేరుగా మాట్లాడిన అదనపు కలెక్టర్ రేషన్ సరుకులు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుల నుండి వచ్చిన అభిప్రాయాలను నమోదు చేసుకున్నారు. పంపిణీలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిశీలనలో స్థానిక తహశీల్దార్ వెంకటేశ్వర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.