19-06-2025 01:08:39 AM
ఎస్పీ నరసింహ
మోతే, జూన్ 18: మండలంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని ఎస్పీ నరసింహ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ డైరీ, రిషప్షెన్ రిజిష్టర్ ని తనిఖీ చేసి మండల పరిధిలో తరచుగా నమోదవుతున్న నేరాలు, పిర్యాదుల తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు.
పోలీసు సిబ్బంది ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని పారదర్శకంగా పని చేయాలని, బాధితులకు సత్వర సేవలందించాలని ఆదేశించారు. గ్రామ రిజిస్టర్లు, హిస్టరీ షీట్స్, రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. బ్లూ కొట్ విధులు, ప్రెట్రో కార్ విధులు ప్రధానమైనవి సంఘటన స్థలాన్ని త్వరగా చేరుకుని ప్రాథమికంగా బాధితులకు భరోసా కల్పించాలని సూచించారు.
జట్టుగా పనిచేస్తూ లక్ష్యంతో ముందుకెళ్తే పోలీసు అనుకున్న విజయాలను సాధించవచ్చునన్నారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు బెట్టింగులు, జూదం లాంటి వాటికి అవకాశం లేకుండా సిబ్బంది పనిచేయాలని సూచించారు.
అలాగే ప్రజలను భాగస్వామ్యం చేస్తూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని. జాతీయ రహదారి వెంట భద్రతను బలోపేతం చేసి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, మోతె పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.