4 July, 2026 | 11:38 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

నగరాభివృద్ధికి ప్రణాళికలు

31-08-2024 02:45 PM

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం,(విజయక్రాంతి): నగరాన్ని ప్రణాళికాబద్ధంగాఅభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం మంత్రి నగరంలోని 34వ డివిజన్ లోని బురదరాఘవపురంలో రూ. 195 లక్షల వ్యయంతో నిర్మించనున్న మేజర్ స్మార్ట్ వాటర్ డ్రైన్, సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు. నిర్మాణ పనులు నాణ్యతతో, నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. రోజువారి పనుల పురోగతిపై పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునకొల్లు నీరజ,  కార్పొరేటర్లు, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, మునిసిపల్ ఇఇ కృష్ణలాల్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.