4 July, 2026 | 10:10 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

గురుకులంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరిస్తా

31-08-2024 02:50 PM

గిరిజన గురుకులం రీజనల్ కోఆర్డినేటర్ ఆగస్తేన్ 

తుంగతుర్తి, (విజయక్రాంతి): గిరిజన గురుకులంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరిస్తానని గురుకులం కోఆర్డినేటర్ ఆగస్తేన్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని గురుకులం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శుక్రవారం పాఠశాల జరిగిన పరిస్థితులపై తనిఖీకి వచ్చినట్లు పేర్కొన్నారు. పాఠశాలలోని బాత్రూంలో కరెంట్ రావడం దురదృష్టకరమని, విద్యార్థులు సేఫ్గా ఉండడం చాలా సంతోషమని అన్నారు.

ఇటువంటి సంఘటనలు ముందు ముందు జరగకుండా చూసుకుంటామని అన్నారు. గత కొంతకాలం నుండి వాటర్ ప్లాంట్ పనిచేయకపోవడం నిజమేనని తక్షణమే ప్రిన్సిపాల్ ది కొటేషన్ వేయించి సమస్యను పరిష్కరిస్తారని అన్నారు. జూనియర్ కళాశాల విద్యార్థులకు ఎకనామిక్ సబ్జెక్టు టీచర్ ను తక్షణమే నియామకం చేపడుతున్నానని తెలిపారు. పాఠశాల నెలకొన్న సమస్యలను తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని ప్రిన్సిపాల్ కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రిన్సిపల్ అపర్ణ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.