2 May, 2026 | 11:09 PM

మంథనిలో పోచమ్మ ఆలయ భూమి కబ్జా

26-06-2024 12:21 AM

మంథని, జూన్ 25: పెద్దపల్లి జిల్లా మంథని ప్రధాన రహదారి పక్కనే ఉన్న పోచమ్మ ఆలయ భూమిని కొంతమంది నాయకులు కబ్జా చేసేందకు ప్రయ త్నిస్తున్నారని మంథని మత్స్యశాఖ అధ్యక్షుడు పోతారవేని క్రాంతి ఆరోపించారు. మంథని మున్సిపల్ పరిధిలో బోయినిపేటలోని గొల్ల గూడెం, తెనుగు గూడెం, దుబ్బ గూడెం ప్రజల ఆరాద్య దైవంగా భావించే పోచమ్మ ఆలయ భూమిని రాజకీయ నాయకుల అండతో కబ్జా చేస్తున్నారని క్రాంతి అవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.