06-01-2026 12:39:14 AM
జైపూర్లోని హై టీ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు
జైపూర్, జనవరి ౫: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)తో సహా జమ్మూ కశ్మీర్ మొత్తాన్ని భారత్లో విలీనం చేయాలని బ్రిటన్ ఎంపీ బ్లాక్మన్ పేర్కొన్నారు. అలాగే ఆర్టికల్ 370ని రద్దు చేయాలని తాను మూడు దశాబ్దాల క్రితమే చెప్పానన్నారు. జమ్మూ కశ్మీర్లోని ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించుకోవడం, పీవోకే ప్రాంతంలో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విస్తరించడం సరైన చర్య కాదని పేర్కొన్నారు.జైపూర్లో జరిగిన హై టీ కార్యక్రమంలో బ్రిటన్ ఎంపీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.ఆర్టికల్ 370 రద్దును ఇప్పుడు కాకుండా 1992లో కశ్మీరీ పండితుల వలసల కన్నా ముందే చేపట్టాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అక్రమంగా ఆక్రమించడమే కాకుండా పీవోకే ప్రాంతంలో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విస్తరిస్తుండడం సరైన చర్య కాదని బాబ్ బ్లాక్మన్ అన్నారు. గతేడాది పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. కశ్మీర్లో పరిస్థితులు మెరుగుపడుతుండడంతో అక్కడ శాంతి నెలకొందని తాను భావించానని.. కాని పహల్గాం దాడితో ఉగ్ర సమస్య మళ్లీ వెలుగులోకి వచ్చిందన్నారు.