calender_icon.png 22 June, 2025 | 9:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

9 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

22-06-2025 05:17:47 PM

నిజాంసాగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాలైన 12 గేట్ల వద్ద ఆదివారం అడవిలో పేకాట ఆడుతున్న 9 మందిని పట్టుకున్నట్లు ఎస్సై శివకుమార్(SI Sivakumar) తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి మండలానికి చెందిన 9 మంది వ్యక్తులు పేకాట ఆడుతూ పట్టుబడినట్లు నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ తెలిపారు. వారి వద్ద నుండి రూ.40,990/- రూపాయలు, 7 సెల్ ఫోన్లు, AP29AA1760 నంబర్ గల ఒక చేవ్రొలెట్ తవేరా వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు తమ సిబ్బందితో వెళ్లి దాడి చేయగా 9 మంది పేకాట ఆడుతూ పట్టుబడినట్లు తెలిపారు.