22-06-2025 05:31:04 PM
ఆగస్టు 15 నాటికి భూభారతి ద్వా రైతులకు స్వాతంత్రం కల్పిస్తాం..
రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మా ణ, సమాచార పౌర సం బంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు చొప్పున రానున్న మూడున్నర ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని తెలిపారు. భూభారతి అమలులో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో 8 లక్షల 60,000 దరఖాస్తులు వచ్చాయని, ఆగస్టు 15 నాటికి వీటిలో న్యాయమైన వాటిని పరిష్కరించి రైతులకు స్వతంత్రాన్ని కల్పించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు.
ఆదివారం మంత్రి నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, లబ్ధిదారులు 400, 600 చదరపు అడుగులో ఇల్లు నిర్మించుకోవాలని సూచించారు. గతంలో చేపట్టి మొండిగోడలు దర్శనమిస్తున్న ఇళ్లకు పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. భూభారతి చట్టం భూములున్న ఆసాములకు చుట్టమయిందని, భూ భారతిపై నిర్వహించిన రెవెన్యూ సదస్సులో రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది లక్షల అరవై వేల దరఖాస్తులు వచ్చాయని గుర్తు చేశారు.
రాబోయే వారం రోజుల్లో వీటన్నిటిని కంప్యూటరైజ్ చేసి న్యాయమైన సమస్యలన్నింటిని ఆగస్టు 15 లోగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. భూభారతి ద్వారా పూర్తి ప్రక్షాళన చేసి రైతులకు న్యాయం చేస్తామని, ఆగస్టు 15 నాటికి రైతులకు భూముల విషయంలో స్వాతంత్రం కల్పిస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ప్రజా పాలన ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకు ఎల్పిజి పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పరిమితిని 10 లక్షలకు పెంచామని చెప్పారు.
ఉగాది నుండి సన్నబియాన్ని పంపిణీ చేస్తున్నామని, సంవత్సరం లోపే 60000 మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి, రైతు భరోసా ఇచ్చిన ఘనత తమదని, ఎకరాకు 12వేలు రైతుభరోసా పెంచామని, తొమ్మిది రోజుల్లో 9000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమయ్యాయని వివరించారు. శాంతిభద్రతలు కాపాడడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, నల్గొండ జిల్లాలోని ఇరిగేష న్ ప్రాజెక్టులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.
ఎస్ ఎల్ బిసిని చేపట్టలేదని, ప్రజలు గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడాను గమనించాలని కోరారు. భద్రాచలంలోని రాముల వారి గుడి కి వంద ఓట్లు ఇస్తామని గత ప్రభుత్వం 100 పైసలు కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం 85 నుండి 90 కోట్ల రూపాయలు ఇచ్చామని, నకిరేకల్ శాసనసభ్యులు కోరిన విధంగా వారం రోజుల్లో రామన్న పేట, నకిరే కల్ తహసిల్దార్ కార్యాలయాలకు భవనాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(State Legislative Council Chairman Gutha Sukender Reddy) మాట్లాడుతూ... ధరణి స్థానంలో భూభారతి తెచ్చిన ఘన త ప్రభుత్వానిదని కొనియాడారు. అధికార యంత్రాంగం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో అడిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని, అవసరమైతే నిబంధనలు సడలించాలని కోరారు. ప్రతి పేదవాడికి ఇల్లు రావాలని ఆకాక్షించారు. ప్రజా ప్రతినిధులు ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉండాలని, సన్న బియ్యం, రైతు భరోసా, భీమా అన్నింటిపట్ల ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను విజయవంతం చేయాలని కోరారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన నకిరేకల్ శాసనసభ్యుల వేముల వీరేశం మాట్లాడుతూ... రామన్నపేట, నకిరేకల్ మండలాలకు తహసిల్దార్ కార్యాలయాల భవనాలు మంజూరు చేయాలని, కట్టంగూర్ లో ప్రభుత్వ భూమి సమస్యను పరిష్కరించాలని కోరారు. భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గత 10 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టలేదని విమర్శించారు. అను నిత్యం తమ ప్రభుత్వం ప్రజల్లో ఉంటూ ప్రజా పాలనకు అర్థం చెబుతున్నది ప్రజా ప్రభుత్వమేనని గుర్తు చేశారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మాట్లాడుతూ... స్వర్గీయ ప్రధాని ఇందిరా గాంధీ పిలుపునిచ్చిన గరీబీ హఠావోకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తు న్నదని పేర్కొన్నారు. పేదరికం తొల గించేందుకు భూ భారతి వచ్చిందని, భూ సమస్యల పరిష్కారానికి వచ్చిన అన్ని దరఖాస్తులు ఆగస్టు 15 లోగా పరిష్కరిస్తామని తెలిపారు. పేదవాడి కడుపు నింపేందుకు ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తున్నదని పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల జాబితా తయారు చేసామని, ఎలాంటి రాజకీయ జోక్యం లేదని, ఇండ్లు వచ్చిన లబ్దిదారులు 30 రోజుల్లో ఇండ్లు మొదలుపెట్టాలని సూచించారు. నాలుగు విడతల్లో ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు చెల్లిస్తామని, మండల స్థాయిలో స్టీల్, సిమెంట్ తదితరాలకు ధరల నియంత్రణ కమిటీ వేశామని చెప్పారు.
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శాస నమండలి సభ్యులు శంకర్ నాయ క్, నెల్లికంటి సత్యం, శాసనసభ్యు లు బత్తుల లక్ష్మారెడ్డి, కుంభం అని ల్ కుమార్ రెడ్డి ,మందుల సామేలు, శాసనమండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్, రెవిన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, యాదాద్రి భు వనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు, రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చా ర్జి అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమీత్, ఆర్ డి ఓ వై. అశోక్ రెడ్డి, గృహ ని ర్మాణ శాఖ పిడి రాజకుమార్, జెడ్పి సీఈ వో శ్రీనివాసరావు, మండలాల అధికారులు,ప్రజాప్రతి నిధులు తది తరులు పాల్గొన్నారు.