16 March, 2026 | 11:54 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

చోరీ చేసిన కొద్దిసేపటికే పోలీసులకు చిక్కిన దొంగలు

18-07-2025 06:59 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): బావి వద్ద ఏర్పాటుచేసిన విద్యుత్ మోటార్లు తరచుగా అపహరణకు గురవుతుండడంతో చెట్టు పైన ఏర్పాటు చేసిన సీసీ కెమెరా తన నాయనమ్మ మెడలో నుంచి అపహరించిన గొలుసు దొంగలను కొద్దిసేపట్లోనే పట్టించింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన బొగ్గు వెంకటమ్మ అనే వృద్ధురాలు పొలంలో కలుపు తీసి రోడ్డుపైకి రాగా అప్పుడే అక్కడికి స్కూటీపై వచ్చిన ఇద్దరు అగంతకులు ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును లాక్కొని ఉడాయించారు. దీనితో బాధితురాలు ఒక్కసారిగా కేకలు వేయడంతో అక్కడికి చేరిన కొందరు వెంటనే ఈ విషయాన్ని వెంకటమ్మ బంధువులకు తెలుపగా ఆమె మనుమడు నందు అక్కడికి చేరుకొని వెంటనే చెట్టు పైన ఏర్పాటు చేసిన సీసీ కెమెరా పుటేజీని పరిశీలించగా, ఇద్దరు వ్యక్తులు స్కూటీపై ముఖానికి దస్తికట్టుకొని ఉన్న దృశ్యాలు కనిపించాయి.

వారే దొంగతనం చేసి ఉంటారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఎస్ఐ మురళీధర్ రాజ్ పోలీసులను అప్రమత్తం చేసి పలు రహదారుల్లో తనిఖీలు చేపట్టారు. సదరు చోరీకి పాల్పడ్డ ఇద్దరు అగంతకులు నెల్లికుదురు మండలం ఆలేరు వైపు వెళ్తుండగా అక్కడ పట్టుకొని ప్రశ్నించడంతో తామే దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించడంతో వారిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని క్రైమ్ బ్రాంచ్ వారికి అప్పగించి విచారణ జరుపుతున్నారు. విద్యుత్ మోటార్ల దొంగల కోసం ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరా తన నాయనమ్మ మెడలో గొలుసును కాపాడుకోగలిగినట్లు మనవడు పేర్కొన్నాడు.