18-07-2025 07:02:35 PM
మేడిపల్లి ఇన్స్పెక్టర్ ఆర్ గోవిందరెడ్డి
మేడిపల్లి: రాబోతున్న బోనాల పండుగ సందర్భంగా మేడిపల్లి ఇన్స్పెక్టర్ ఆర్ గోవిందరెడ్డి అధ్యక్షతన వివిధ ఆలయాల చైర్మన్ లతో, ఆర్గనైజర్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ప్రజలు శాంతియుత మార్గంలో జాతరను జరుపుకోవాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా బందోబస్తు ఏర్పాటులపై చర్చించడం జరిగింది. అల్లరి మూకలపై ప్రత్యేక నిఘా ఉంటుందని ఇట్టి సమావేశంలో వారికి తెలియపరచడం జరిగింది.