19-06-2025 01:37:19 AM
నిజామాబాద్ జూన్ 18 (విజయ క్రాంతి) : పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కందకుర్తి వద్ద గల త్రివేణి సంగమం నది పరివాహక ప్రదేశాలను భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారూ వర్షా కాలము భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిజామాబాదు, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలని నీటి పరివాహక ప్రాంతాల్లో మరియు నదులు, కాలువల ప్రాంతాలలో ప్రజలు వారి యొక్క మ్రొక్కులు తీర్చుకోవడానికి , మరియు స్నానాలు చేయడానికి వస్తుంటారు.
కావున, ప్రజల భద్రత నేపథ్యంలో అట్టి స్థలాలలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాలని ఏసిపి లకు, సీఐ లకు, ఎస్ హెచ్ ఓ లకు, SI లకు ఆదేశాలు జారిచేయడం జరిగింది. ఇందులో భాగంగా కందకుర్తీ వద్ద గల త్రివేణి సంగమం ఘాటుకు తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక రాష్ట్రాల నుండి ప్రజలు చాలా మంది వస్తూ ఉంటారు. త్రివేణి సంగమం నదిలో స్నానం చేయడానికి అని నీటి లోనికి లోపలికి వెళుతూ ఉంటారు. వారు అనుకోకుండా నది లోపలికి వెళ్ళిపోయిన అనంతరం వారికి ఈత రాకపోవడం వలన నదిలో మునిగి పోయే అవకాశం ఉంది.
కావున ఇట్టి నది పరివాహ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పీ.ఎస్*.రెంజల్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ త్రివేణి సంగమం వద్ద గజ ఈతగాలను అందుబాటులో ఉంచాలని , ఘాట్ల వద్ద ప్రమాదాలు నివారణకు భారికేడ్లు, ప్రమాద గటికలను గుర్తించి ఆ ప్రాంతంలో అటు వైపు ఇటు వైపు త్రాడు తో కటీ వేయాలని, అట్టి త్రాడు దాటి ఎవరు ముందుకు వెళ్ళారాదని తెలిపే విధంగా ఏర్పాట్లు చేయాలనీ ,
ప్రమాద గటికల చిహ్నంలు ఫ్లెక్సీ రూపంలో తయారు చేసి ఉంచాలని తెలియజేయడమైనది. బోధన్ ఏసీపి పి. శ్రీనివాస్, బోధన్ రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీ డి. విజయ్ బాబు, రెంజల్ ఎస్త్స్ర కె. చంద్ర మోహన్ తదితరులు సిపి వెంట ఉన్నారు .