calender_icon.png 28 June, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల నిర్బంధం తనిఖీలు

28-06-2025 07:54:39 PM

కాగజ్ నగర్,(విజయ క్రాంతి):  కాగజ్ నగర్ పట్టణంలోని సుభాష్ కాలనీలో శనివారం పోలీసులు కార్ట్ న్ అండ్ సర్చ్ నిర్వహించారు. లైసెన్స్ లేని 58 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోల ను స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పి రామానుజన్ మాట్లాడుతూ... యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దన్నారు.

కాలనీలో కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. విధిగా  ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాల సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పి తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పోలీసులు పాల్గొన్నారు.