ప్రమాదాలు జరగకుండా, ప్రజల సంరక్షణకై ప్రత్యేక డ్రైవ్
పెండింగ్ చలానాలు లేకుండా వాహనాల ధ్రువపత్రాలు సరిగ్గా ఉంచుకోవాలి
ప్రొబేషనరీ ఎస్ఐ అరుణ్ కుమార్
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ప్రమాదాలు జరగకుండా ప్రజల సంరక్షణకై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎల్లారెడ్డి ప్రొబేషనరీ ఎస్ఐ అరుణ్ కుమార్ తెలిపారు. గురువారం ఎల్లారెడ్డి మండలంలోని మల్లయ్య పల్లి గ్రామ శివారు ప్రాంతంలో ప్రత్యేక డ్రైవ్ వాహనాల తనిఖీ నిర్వహించారు. తనికిలో భాగంగా, ప్రొబేషనరీ ఎస్ఐ అరుణ్ కుమార్(Probationary SI Arun Kumar) మాట్లాడుతూ... వాహనదారులు తమ వాహనాలపై ఎలాంటి పెండింగ్ చలాన్లు లేకుండా వాహనం యొక్క ద్రవపత్రాలు ఉంచుకోవాలని, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని వాహనదారులకు సూచించారు. వాహరదారులు రహదారిపై ప్రయాణించడం సక్రమంగా ప్రయాణించాలని పరిమితికి మించి వేగంగా వాహనం నడిపినట్లు అయితే ప్రమాదాలు సంభవిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి పోలీస్ సిబ్బంది బాలకృష్ణ, ఏఆర్ ఫోర్స్ పాల్గొన్నారు.






