calender_icon.png 19 June, 2025 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కూల్ పేరును ప్రింట్ చేసి అమ్ముతుండ్రు

19-06-2025 12:49:33 PM

జడ్చర్ల శ్రీ చైతన్య పాఠశాల నిలువు దోపిడి..

ఓ ఇంట్లో పెట్టి యాదేచ్ఛంగా నోటు పుస్తకాల విక్రయం 

ఇంటిముందు నిల్చోని నిరసన తెలిపిన ఏబీపీ కార్యకర్తలు

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): ప్రైవేటు విద్యాసంస్థల ఆగడాలు ఆగడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అందిన కాడికి దండుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు అటువైపే చూడడమే మానేశారు. విద్యార్థి సంఘాల నాయకులు కొందరు ఆయా ప్రవేట్ పాఠశాలల యాజమాన్యాల పనితీరును పరిశీలిస్తూ వారి నిరసనలను తెలియజేస్తున్నారు. అధికారులు మాత్రం ఈ పని మాది కాదు అన్నట్టు వివరించడంతో జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జడ్చర్ల శ్రీ చైతన్య పాఠశాల నిర్వాకం...

తమను ఆపేది ఎవరు అనే విధంగా జడ్చర్ల లోని శ్రీ చైతన్య పాఠశాల నిర్వాహకులు యదేచ్చంగా నోట్ పుస్తకాలపై పాఠశాల పేరును ప్రింట్ చేసి దర్జాగా విద్యార్థులకు అమ్ముతుండ్రు. పాఠశాలలో విక్రయిస్తే ఆరోపణలు వస్తాయని విషయాన్ని ముందస్తుగా గమనించి, పాఠశాల నిర్వాహకులతోనే మరో ప్రాంతంలో ఓ ఇండ్లను అద్దెకు తీసుకొని ఆ ఇంటిలో నోటు పుస్తకాలను ఉంచి విద్యార్థుల తల్లిదండ్రులకు ఆ చిరునామ ఇస్తూ ప్రింట్ చేసిన నోట్ పుస్తకాలను విక్రయిస్తున్నారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న ఏబీవీపీ కార్యకర్తలు నోట్ పుస్తకాలు విక్రయిస్తున్న వారి ఇంటి ముందు నిల్చని నిరసన తెలిపారు. నిర్వాహకులను ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెబుతున్నారని ఏబీవీపీ కార్యకర్తలు తెలియజేశారు. ఆదాయమే పరమ అవధిగా ఆ పాఠశాలలు అడుగులు వేయడం ఎంతవరకు విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన చేస్తారు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

అధికారుల చర్యలు నిల్...

అసలు మహబూబ్ నగర్ జిల్లా లో విద్యాశాఖ ఉందో లేదో అని అనుమానం వస్తుంది. ప్రైవేట్ పాఠశాలల వైపు కనీసం ఇలా నిర్వహణ జరుగుతుంది అనే చూడడమే మానేశారు. నియమ నిబంధనలు అమలు చేయించే అధికారులే అటువైపు చూడడమే మానేస్తే విద్యార్థుల తల్లిదండ్రులు ఆ బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ పనితీరుపై ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయినప్పటికీ విద్యాశాఖ అధికారులు స్పందిస్తారా లేదా చూడాలి. ఈ విషయాలపై పలుమార్లు విద్యాశాఖ అధికారికి ఫోన్ చేసినప్పటికీ కూడా ఫోన్ లిఫ్ట్ చేయక విడ్డూరంగా ఉంది. ఉన్నత అధికారులు నిబంధనలు పాటించని ప్రవేట్ పాఠశాలలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.